Latest

రామగుండంలో యూరియా ఉత్పత్తికి అంతరాయం
Local· 22 Aug 2026

రామగుండంలో యూరియా ఉత్పత్తికి అంతరాయం

TG: కరీంనగర్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని RFCL యూరియా పరిశ్రమలో రిఫార్మర్ సిస్టం ఎల్బోలో భారీ శబ్దంతో పగిలి పోయినట్టు తెలుస్తుంది. దీంతో అమోనియా లీక్ అయ్యి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. యూరియా ఉత్పత్తికి వారం రోజులపాటు అంతరాయం ఏర్పడనుంది. తరచూ కర్మగారంలో యూరియా లీక్ అవడంతో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.

ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!
Infotainment· 22 Aug 2026

ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!

ఆదివాసీల జీవన విధానంలో అడవి అంటే కేవలం చెట్లు, కొండలు మాత్రమే కాదు. వారి ఆహారం, ఆరోగ్యం, సంస్కృతి, జీవనాధారం కూడా. వర్షాకాలం ప్రారంభమైతే అడవుల్లో ప్రకృతి అందాలతోపాటు అనేక రకాల సహజ ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కోరేడిగా పిలిచే వెదురు కొమ్ములు వర్షాకాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. అడవిలోకి వెళ్లే ఆదివాసీ ప్రజలు తాజా వెదురు కొమ్ములను సేకరించి ఇళ్లకు తీసుకువస్తారు. అనంతరం తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ పద్ధతుల్లో వాటిని శుభ్రం చేసి వంట చేసుకుంటారు.

సన్నవడ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి
Local· 22 Aug 2026

సన్నవడ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి

TG: సన్నవడ్లు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని భీమదేవరపల్లి మండల వ్యవసాయ అధికారిణి పద్మ సూచించారు. సెప్టెంబర్ 10వ తేదీలోగా సన్న రకాల వడ్లు వేసిన రైతులు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులు సన్న విత్తనాలు కొనుగోలు చేసిన సంబంధిత డీలర్ల వద్దే ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. సొంతంగా అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలతో పంట సాగు చేసిన రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించి సంబంధిత ఏఈఓల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

శిలాఫలకంపై ‘నియోజకవర్గం’ గందరగోళం!
Local· 22 Aug 2026

శిలాఫలకంపై ‘నియోజకవర్గం’ గందరగోళం!

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంపై జరిగిన మిస్టేక్ చర్చనీయాంశంగా మారింది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేరు కింద కోరుట్లకు బదులుగా మెట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలోనే ఈ పొరపాటు జరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పటి మెట్‌పల్లి నియోజకవర్గం మళ్లీ ఏర్పడిందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్
Local· 22 Aug 2026

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలను సమీక్షిస్తూ డి-గ్రేడ్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థుల చదువులో వెనుకబాటుతనాన్ని గుర్తించి అవసరమైన ప్రత్యేక బోధన అందించాలన్నారు. అర్హులైన ప్రత్యేక అవసరాల పిల్లలకు చేయూత పింఛన్, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన
Local· 22 Aug 2026

ప్రజాసమస్యల పరిష్కారానికి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన

TG: ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వరుసగా మూడోరోజు పర్యటించిన మంత్రి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పెంట్లవెల్లిలో ప్రతిపాదిత స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మ్యూటేషన్ల కోసం ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.

కార్మికుల పోరుబాట.. 24 నుంచి నిరాహార దీక్షలు
Local· 22 Aug 2026

కార్మికుల పోరుబాట.. 24 నుంచి నిరాహార దీక్షలు

TG: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24, 25 తేదీల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు నానహే సాబ్, తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోతగల్‌లో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ హౌస్‌కీపింగ్ వర్కర్స్ నిరసన
Local· 22 Aug 2026

అసెంబ్లీ హౌస్‌కీపింగ్ వర్కర్స్ నిరసన

AP : అమరావతి మల్కాపురం సెంటర్‌లో అసెంబ్లీ, సచివాలయం హౌస్‌కీపింగ్ టీమ్స్ తమ జీతాలు పెంచాలని నిరసన చేపట్టాయి. 2019 తర్వాత నుంచి ఇప్పటివరకు జీతాలు పెరగలేదని, భారీగా పెరిగిన ఖర్చులు, ఇంటి అద్దెలతో సర్దుకుపోవడం కష్టంగా మారిందని కార్మికులు తెలిపారు. మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్లకి నెలకి రూ. 21,000 ఇస్తుంటే, తమకు మాత్రం రూ. 10,470 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా జీతాలు పెంచకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఎక్కువ చేస్తామని చెప్పారు.

రెండు కార్లు ఢీ.. చిన్నారికి గాయాలు!
Local· 22 Aug 2026

రెండు కార్లు ఢీ.. చిన్నారికి గాయాలు!

TG: హనుమకొండ జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డైరీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హుస్నాబాద్ వైపు నుంచి వస్తున్న కారు, ముల్కనూర్ వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ చిన్నారికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పలమనేరులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’
Local· 22 Aug 2026

పలమనేరులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

AP : చిత్తూరు జిల్లాలో పలమనేరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా శనివారం పారిశుధ్య పనులు చేశారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వార్డుల్లో శుభ్రత, ఫాగింగ్, బ్లీచింగ్, డ్రైనేజీ పూడికతీత పనులు పూర్తి చేశామని మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్ తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు
Local· 22 Aug 2026

సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు

TG: CPI మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా హిమాయత్‌నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, CPI జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, CPI జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, డి.వి.విజయలక్ష్మి, సయ్యద్ అజీజ్ పాషా పూలమాల వేసి నివాళులర్పించారు.

కామారెడ్డి కలెక్టర్ సెలవు: మెదక్ కలెక్టర్‌కు బాధ్యతలు
Local· 22 Aug 2026

కామారెడ్డి కలెక్టర్ సెలవు: మెదక్ కలెక్టర్‌కు బాధ్యతలు

TG : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10 వరకు సెలవుపై విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇన్చార్జి బాధ్యతలు చూసుకుంటారని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.సెలవుకు వెళ్లేముందు శనివారం నిజామాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొంటారు.

రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి
Local· 22 Aug 2026

రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి

TG: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి 26 వరకు జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఐటీయూ వనపర్తి జిల్లా నాయకత్వం ప్రకటించింది. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని కోరారు. ఈఎస్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం
TG· 22 Aug 2026

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం

TG: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కూలింది. 50 గజాల్లో నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనం కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

ఆగస్టు 24 నుంచి యాత్ర- దేవేంద్ర నాథ్ మహతో
Education· 22 Aug 2026

ఆగస్టు 24 నుంచి యాత్ర- దేవేంద్ర నాథ్ మహతో

దేవేంద్ర నాథ్ మహతో రాంచీలో మీడియాతో మాట్లాడుతూ, CGL ఇష్యూపై విద్యార్థుల తరఫున తాము చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సంస్కరించేందుకు ఆగస్టు 24 సోమవారం నుంచి 24 జిల్లాల్లో 'రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ రీఫార్మ్ యాత్ర' చేపడుతున్నట్లు అనౌన్స్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు
Local· 22 Aug 2026

నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ తదితర మండలాల్లో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు రాక పత్తి తదితర పంటలు వాడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వర్షం ముఖం చాటేయడంతో పంటలు వాడిపోతున్నాయని అంటున్నారు.

‘ఇరుముడి’ DAY 1 కలెక్షన్స్
Entertainment· 22 Aug 2026

‘ఇరుముడి’ DAY 1 కలెక్షన్స్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా మొదటిరోజు మంచి వసూళ్లు సాధించింది. మనదేశంలో సుమారు రూ.14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.24.20 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్‌లోనే మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది.

వెయ్యేళ్లకు పైబడిన గుంటూరు చరిత్ర
Local· 22 Aug 2026

వెయ్యేళ్లకు పైబడిన గుంటూరు చరిత్ర

AP: గుంటూరు నగరానికి వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. క్రీ.శ.669లో తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధనుడు–II కాలం నాటి పూణే తామ్రశాసనాల్లో కుంటూరు, గొంటూరు, గుంటూరు పేర్లు కనిపిస్తాయి. 10వ శతాబ్దపు ఎడేరు తామ్రశాసనంలోనూ ‘గొంటూరు’గా ప్రస్తావన ఉంది. 10 నుంచి 14వ శతాబ్దాల వరకు శాసనాల్లో ఈ పేరు కనిపించింది. ఉమ్మడి గుంటూరు పరిధిలోని పల్నాడు కూడా మధ్యయుగంలో కీలక రాజకీయ కేంద్రంగా వెలుగొందింది.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
Local· 22 Aug 2026

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

TG: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్య విద్యార్థులు, వైద్యులు, రోగులతో మాట్లాడారు. విద్యార్థుల శిక్షణ, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్న అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో సమావేశమై ప్రతి రోగికి మెరుగైన వైద్యం, అవసరమైన శ్రద్ధ అందించాలని సూచించారు.

ఆశ్రమ పాఠశాలకు మహిళా వార్డెన్‌ను నియమించాలి: SFI
Local· 22 Aug 2026

ఆశ్రమ పాఠశాలకు మహిళా వార్డెన్‌ను నియమించాలి: SFI

TG: బాలికల వసతి గృహంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పూర్తిస్థాయి మహిళా వార్డెన్‌ను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్, DTDOకు వినతిపత్రం అందజేశారు. బాలికల వసతి గృహానికి ప్రస్తుతం పురుష వార్డెన్ ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థినుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మహిళా వార్డెన్‌ను నియమించాలని కోరారు. పారిశుధ్యం, తాగునీరు తదితర కనీస వసతులు మెరుగుపరచాలన్నారు.

స్కూళ్ల సమస్యలపై Gen Alpha గళం.. దేశవ్యాప్తంగా ఫోకస్‌లోకి!
Current Affairs· 22 Aug 2026

స్కూళ్ల సమస్యలపై Gen Alpha గళం.. దేశవ్యాప్తంగా ఫోకస్‌లోకి!

దేశంలో Gen Alpha విద్యార్థుల వరుస ప్రొటెస్ట్లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. స్కూళ్లలో బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల కొరత, పనిచేయని టాయిలెట్లు, ప్లేగ్రౌండ్లు లేకపోవడం, స్కూళ్లకు సరైన రోడ్లు లేకపోవడంపై ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 300 మంది స్టూడెంట్స్ స్కూల్ రోడ్డు కోసం 6 కి.మీ. నడిచారు. లక్నోలో 250 మంది బాలికలు టీచర్ల కొరతపై నిరసన చేశారు. గవర్నమెంట్ డేటా కూడా దేశంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్లు చెబుతుంది.