← Back to news

శిలాఫలకంపై ‘నియోజకవర్గం’ గందరగోళం!

By Srikanth· 22 Aug 2026· Jagitial, Jagitial, Jagitial
శిలాఫలకంపై ‘నియోజకవర్గం’ గందరగోళం!

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంపై జరిగిన మిస్టేక్ చర్చనీయాంశంగా మారింది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేరు కింద కోరుట్లకు బదులుగా మెట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలోనే ఈ పొరపాటు జరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పటి మెట్‌పల్లి నియోజకవర్గం మళ్లీ ఏర్పడిందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

More in Local