AP

కానిస్టేబుల్‌పై అటాక్.. ఇద్దరు యువకులు అరెస్ట్
AP· 13 Aug 2026

కానిస్టేబుల్‌పై అటాక్.. ఇద్దరు యువకులు అరెస్ట్

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆగస్టు 11న రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యతో ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. వారిలో అచ్చి శ్రీనివాసులు<a href="https://www.theclearcutnews.com/n/bgHVjsn"> కత్తితో</a> దాడికి యత్నించగా, అప్రమత్తమైన రమణయ్య తృటిలో తప్పించుకున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అచ్చి శ్రీనివాసులు (22), బీటెక్ విద్యార్థి సముద్రాల జితేంద్ర కుమార్ (20)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులును పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

భగ్గుమన్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు
AP· 11 Aug 2026

భగ్గుమన్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు

AP: నష్ట పరిహారం ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామాలు వదిలి వెళ్లిపోయాలని అధికారులు ఆదేశించడంపై వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు భగ్గుమన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి ప్రవేశించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవితోపాటు జిల్లా కార్యదర్శి సోమయ్య సంఘీభావం తెలిపారు. ‘పరదాలు కట్టుకుని, బిక్కుబిక్కుమంటూ బతికితే ఆ బాధ మీకు తెలుస్తుందని’ అధికారులు, పాలకులను ఉద్దేశించి రమాదేవి విమర్శించారు.