← Back to news

రాజధాని పనుల్లో వేగం పెంచాలి: అమిత్ షా

By dk· 11 Aug 2026· ఢిల్లీ
రాజధాని పనుల్లో వేగం పెంచాలి: అమిత్ షా

AP: అమరావతి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా TDP MPలకు సూచించారు. TDP పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో MPలు ఢిల్లీలోని పార్లమెంట్‌లో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పురోగతిపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆయనకు అందజేశారు. రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు, ఇప్పటివరకు సాధించిన పురోగతిని వారు వివరించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆర్థిక, చట్టపరమైన సహకారం అందిస్తున్నందుకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.

More in AP