← Back to news

నీటి కోసం రోడ్డెక్కిన కాలనీవాసులు

By dk· 11 Aug 2026· సత్యసాయి జిల్లా
నీటి కోసం రోడ్డెక్కిన కాలనీవాసులు

AP: సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో తాగునీటి సమస్యపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నెలరోజులుగా పలు కాలనీల్లో నీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదని వాపోయారు. ఖాళీ బిందెలతో MPDO కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. MPDO అశోక్‌కుమార్‌రెడ్డి లేకపోవడంతో ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శి వారితో చర్చించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

More in AP