పరిశ్రమలకు బిగ్ బూస్ట్

ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను SIPB ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,667 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.



