Crime· 10 Apr 2026
సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం నిఘా
మావోయిస్టురహిత దేశం ఏర్పడిందని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు వారి సానుభూతిపరులపై దృష్టి సారించింది. మావోయిస్టులకి అనుకూలంగా సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచింది. తెలంగాణలో ప్రజాసమస్యలపై స్పందించే కవులు , కళాకారులు, మేధావులు మొత్తం 200 మందిపై అర్భన్ నక్సల్స్ ముద్ర వేసి వారి కదలికలను గమనిస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వికల్స్ అంత్యక్రియలకు హాజరై మాట్లాడిన వారందరికీ నోటీసులు వెళ్లాయి. కవి నందిని సిద్ధారెడ్డి, పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ లను పలు మార్లు విచారించారు. ఇదే కేసులో ఇప్పటికే గాదె ఇన్నయ్య జైల్లో ఉన్నారు. మావోయిస్టుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాకుండా వాటికి లైక్ లు, కామెంట్లు పెట్టేవారిపై కూడా కేంద్రం నిఘా పెంచింది.