Crime

భర్త నల్లగా ఉన్నాడని…
Crime· 10 Apr 2026

భర్త నల్లగా ఉన్నాడని…

భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అత్యంత ఘోరానికి పాల్పడింది. ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసి అతనిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. మధ్యప్రదేశ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. పురోహిత్ దేవ్ కృష్ణ ఈ నెల 7న అతని ఇంట్లో శవమై కనిపించాడు. డబ్బుల కోసమే ఎవరో అతనిని చంపారన్నట్టుగా భార్య ప్రియాంక ఇంటిని క్రియేట్ చేసింది. పోలీసులు కూడా మొదట రాబరీలో భాగంగానే హత్య జరిగిందని అనుకున్నారు. కానీ విచారణలో ప్రియాంక తన ప్రియుడు కమలేష్ తో కలిసి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి ప్రొఫషనల్ కిల్లర్స్ తో హత్య చేయించిందని తేలింది చాలా రోజులుగా ప్రియాంక తన భర్తని నువ్వు నల్లగా ఉన్నావంటూ హేళన చేసేదని, నువ్వు నాకు సరిపోవంటూ వేధించేదని కుటుంబ సభ్యులు చెప్పారు.

సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం నిఘా
Crime· 10 Apr 2026

సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం నిఘా

మావోయిస్టురహిత దేశం ఏర్పడిందని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు వారి సానుభూతిపరులపై దృష్టి సారించింది. మావోయిస్టులకి అనుకూలంగా సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచింది. తెలంగాణలో ప్రజాసమస్యలపై స్పందించే కవులు , కళాకారులు, మేధావులు మొత్తం 200 మందిపై అర్భన్ నక్సల్స్ ముద్ర వేసి వారి కదలికలను గమనిస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వికల్స్ అంత్యక్రియలకు హాజరై మాట్లాడిన వారందరికీ నోటీసులు వెళ్లాయి. కవి నందిని సిద్ధారెడ్డి, పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ లను పలు మార్లు విచారించారు. ఇదే కేసులో ఇప్పటికే గాదె ఇన్నయ్య జైల్లో ఉన్నారు. మావోయిస్టుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాకుండా వాటికి లైక్ లు, కామెంట్లు పెట్టేవారిపై కూడా కేంద్రం నిఘా పెంచింది.