యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించి.. చివరకు ప్రాణం తీశాడు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమణి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.మనోహర్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి దగ్గర పడుతుండగా అతనికి ఎయిడ్స్ ఉందని తెలిసి పెళ్లికి నిరాకరించినందుకు, నిందితుడు మనోహర్ ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించాడు. ఈ దారుణాన్ని అవమానంగా భావించిన రమణి, మేడ్చల్ జిల్లాలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఈ విషాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.



