Current Affairs· 27 Aug 2026
నేపాల్ వరదల్లో చిక్కుకున్న AP ప్రజలు
నేపాల్ వరదల్లో AP నుంచి వెళ్లిన కొంతమంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఏపీ ప్రభుత్వ అధికారులు వీరి వివరాలు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గల్లంతైన లేదా చివరిసారిగా కనిపించినవారు..చొప్పరపు రమేశ్బాబు, అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర ఆనాఘ, బాలసుబ్రహ్మణ్యం, శశికుమార్ అట్లూరి, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ. వీళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. చిక్కుకున్నవారిలో భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు, అపర్ణ కాకాని సురక్షితంగా ఉన్నారు.