Current Affairs

RSS కార్యక్రమంలో పాల్గొన్నందుకు గవర్నమెంట్ టీచర్ల సస్పెన్షన్
Current Affairs· 28 Aug 2026

RSS కార్యక్రమంలో పాల్గొన్నందుకు గవర్నమెంట్ టీచర్ల సస్పెన్షన్

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు RSS రూట్‌ మార్చ్‌లో పాల్గొన్నందుకు సస్పెండ్‌ చేశారు. కర్ణాటక సివిల్‌ సర్వీసెస్‌ (కండక్ట్‌) రూల్స్‌, 2021కు వ్యతిరేకమని విద్యాశాఖ పేర్కొంది. యాద్గిర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ చన్నబసప్ప ముధోల్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. హునసగి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ అసిస్టెంట్‌ టీచర్‌ గురురాజ్‌ జోషి, సూర్‌పూర్‌ తాలూకా కుప్పిలోని ప్రభుత్వ లోయర్‌ ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ టీచర్‌ అన్నా సాహెబ్‌ దేశ్‌ముఖ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.