‘ముస్లిం సంస్థల కార్యక్రమాలు ఇస్లాం పరిధిలోనే ఉండాలి’
కేరళంలోని సమస్త కేరళ జమియ్యతుల్ ఉలమా సంస్థ ఎపి(కాంతపురం) వర్గం ముస్లిం సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది. మహల్ కమిటీలు, మసీదులు, మద్రసాలు, ఇతర ముస్లిం సంస్థలు తమ పేరుతో జరిపే కార్యక్రమాలు ఇస్లామిక్ నియమాల పరిధిలోనే ఉండాలని చెప్పింది. ఇటీవల మలబార్ ప్రాంతంలో ఓణం పండుగ జరుపుకున్నప్పుడు ముస్లిం అమ్మాయిలు పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. మిలాద్-ఎ-షరీఫ్ (నబి దినం) కార్యక్రమాల్లో కూడా మహిళలు పాల్గొన్నారు. దీంతో సంస్థ ఈ ప్రకటన చేసింది.


