కర్ణాటకలో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన
బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ఆఫీసు బయట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పబ్లిక్ ర్యాలీ తర్వాత శ్రీ రామ్ సేనా ధర్మార్థ సేవా న్యాస్ అక్కడ శుద్ధీకరణ హవన్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నిరసన తెలిపింది. బీజేపీ దళితులపై వివక్ష చూపుతోందని నేతలు ఆరోపించారు. మైసూరులోనూ యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.


