Local

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్
Local· 22 Aug 2026

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలను సమీక్షిస్తూ డి-గ్రేడ్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థుల చదువులో వెనుకబాటుతనాన్ని గుర్తించి అవసరమైన ప్రత్యేక బోధన అందించాలన్నారు. అర్హులైన ప్రత్యేక అవసరాల పిల్లలకు చేయూత పింఛన్, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.