← Back to news

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం

By Rajaratnam· 22 Aug 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం

AP: వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం మరో రూ.250 కోట్ల పరిహారం అందించింది. ఉండవల్లి నివాసంలో CM చంద్రబాబు నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్లచెక్కు ను అందజేశారు. ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అందించిన మొత్తం పరిహారం రూ.768 కోట్లకు చేరింది. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

More in Local