రాజా బహదూర్ సేవలు అజరామరం: ఎమ్మెల్యే

TG: విద్యారంగాన్ని బాగు చేసి, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలు అజరామరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజా బహదూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.



