ఇక మేము స్కూలుకు పోము..!

ఆ ఇద్దరు బాలికలు బడికి వెళ్లడం మానేశారు. గవర్నమెంటు ఇచ్చే పరిహారమూ వద్దన్నారు. కాల్స్ కి స్పందించడమూ మానేశారు. ఆగస్టు 6న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇద్దరు మైనర్ బాలికలు (8వ క్లాసు) హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ఆటో డ్రైవర్ వంశీకిరణ్, ఆయన ఫ్రెండు సిద్దూ వారిని దారి మళ్లించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయని SP విద్యాసాగర్ నాయుడు చెప్పారు. POCSO కింద ఆ నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత బాలికలు బడికి దూరమయ్యారు. చదువుతో కూడిన కలలకూ దూరమయ్యారు.



