← Back to news

ఇక మేము స్కూలుకు పోము..!

By Jagadish· 10h ago
ఇక మేము స్కూలుకు పోము..!

ఆ ఇద్దరు బాలికలు బడికి వెళ్లడం మానేశారు. గవర్నమెంటు ఇచ్చే పరిహారమూ వద్దన్నారు. కాల్స్ కి స్పందించడమూ మానేశారు. ఆగస్టు 6న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇద్దరు మైనర్ బాలికలు (8వ క్లాసు) హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ఆటో డ్రైవర్ వంశీకిరణ్, ఆయన ఫ్రెండు సిద్దూ వారిని దారి మళ్లించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయని SP విద్యాసాగర్ నాయుడు చెప్పారు. POCSO కింద ఆ నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత బాలికలు బడికి దూరమయ్యారు. చదువుతో కూడిన కలలకూ దూరమయ్యారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 55m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.