Latest

క్షమాపణ చెప్పినా తగ్గని మెటా సెన్సార్‌షిప్!
Gen Z· 16 Aug 2026

క్షమాపణ చెప్పినా తగ్గని మెటా సెన్సార్‌షిప్!

ప్రధాని మోదీ వీడియో పొరపాటున డిలీట్ చేసినందుకు పార్లమెంట్ కమిటీ మెటాను నిలదీసింది, safe harbour తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో మెటా అధికారి ఢిల్లీ వచ్చి క్షమాపణ చెప్పారు. కానీ అదే టైంలో కేజ్రీవాల్, CJP నేతలు, జుబేర్ పోస్టులు కూడా బ్యాన్ అయ్యాయి. కానీ మెటా రియాక్ట్ అవ్వట్లేదని ఫిర్యాదు చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ మీడియా 'Alt News' ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది.

Instagram డిజిటల్ సెన్సార్షిప్, కంటెంట్ క్రియేటర్స్ షాక్
Gen Z· 16 Aug 2026

Instagram డిజిటల్ సెన్సార్షిప్, కంటెంట్ క్రియేటర్స్ షాక్

జులై 20 జంతర్ మంతర్ నిరసనల తర్వాత, CJP వీడియోలు, పొలిటికల్ satire పోస్టులను Instagram ఒక్కొక్కటిగా తీసేస్తోంది. "లీగల్ రిక్వెస్ట్" అని మెటా చెప్తుంది గానీ వీడియోలో ఏం తప్పు ఉందో చెప్పట్లేదు. అప్పీల్ చేసుకునే దారీ లేదు. కంటెంట్ క్రియేటర్స్ అంజలి ప్రియ, శ్రేష్ఠి ఖన్నా లాంటి వాళ్లు దీన్ని "డిజిటల్ ఎమర్జెన్సీ" అంటున్నారు. వైరల్ అయిన వీడియోలనే టార్గెట్ చేస్తున్నారని క్రియేటర్ల ఆరోపణ. ఫ్యాక్ట్ చెక్ మీడియా Alt News కథనంఓ డిజిటల్ సెన్సార్షిప్ పై చర్చ జరుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?

ఒక్కసారిగా వణికిన ఫ్లోరెస్‌ ద్వీపం.. 47 మంది మృతి!
Current Affairs· 16 Aug 2026

ఒక్కసారిగా వణికిన ఫ్లోరెస్‌ ద్వీపం.. 47 మంది మృతి!

ఇండోనేషియాలోని ఫ్లోరెస్‌ ఐలండ్ దగ్గరలో నిన్న ఉదయం 5.58 గం. 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 47 మంది చనిపోగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని ప్రాంతాల నుంచి 2 వేల మందిని టెంపరరీ క్యాంప్స్‌కు తీసుకెళ్లారు. ల్యాండ్‌స్లైడ్స్ విరిగిపడటం, రోడ్లు డ్యామేజ్ అవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలిగాయి. ముందు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, తర్వాత వాటిని విత్‌డ్రూ చేసుకున్నారు. ఇదే రోజు ఉత్తర సుమత్రాలో 6.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
AP· 16 Aug 2026

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

AP: కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు గల్లంతైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వైపు వెళ్తుండగా ఐతంపూడి లాకుల మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో నుంచి బయటకు దూకి ఓ యువకుడు ఈత కొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే మిగిలిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిని పోతుల లక్ష్మీభాను (18), రాజారాం (17), నాగిరెడ్డి దుస్వంత (18), సాయిసూర్య (19)గా పోలీసులు గుర్తించారు.

విహారయాత్రలో ఊహించని విషాదం
Local· 16 Aug 2026

విహారయాత్రలో ఊహించని విషాదం

TG: నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన దుర్గం తిరుమలేష్‌ (25) ఆరుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చాడు. బ్యాక్‌వాటర్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న SI నాగేంద్రబాబు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టి
TG· 16 Aug 2026

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టి

TG: రైతుల సంక్షేమంతోపాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 27లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

హస్తకళలకు అండగా పవన్‌.. వుడ్‌ బ్యాంక్‌ ప్రారంభం
AP· 16 Aug 2026

హస్తకళలకు అండగా పవన్‌.. వుడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

AP: హస్తకళాకారులకు ముడిసరుకు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఏర్పాటు చేశామని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని మరో ఆరు క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా సుమారు 5 వేల మంది హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. అనంతరం పవన్ దంపతులు కళాకృతులను పరిశీలించి కళాకారులతో మాట్లాడారు.

కేంద్ర పథకాల్లో CM ఫొటో పెట్టాల్సిందే: మంత్రి
TG· 16 Aug 2026

కేంద్ర పథకాల్లో CM ఫొటో పెట్టాల్సిందే: మంత్రి

TG: కేంద్రప్రభుత్వ పథకాల్లో CM రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. GSTతో పాటు ఇతర పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తోందని, అందుకే రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాల్లో CM ఫొటో ఉండాలని అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం ఎవరిదో కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలోచించుకోవాలని విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే దమ్ము BJPకి ఉందా? అని ప్రశ్నించారు.

APని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు
AP· 16 Aug 2026

APని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌-1గా నిలపాలన్నదే లక్ష్యమని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలకులుగా కాకుండా ప్రజాసేవకులుగా పనిచేస్తున్నామని అన్నారు. వికాసం నుంచి వైభవం, సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చిందన్నారు.

ఎవరేం చేశారో అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం: CM
TG· 16 Aug 2026

ఎవరేం చేశారో అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం: CM

TG: పదేళ్ల BRS పాలనలో ఏంచేశారు.. రెండున్నరేళ్లలో మేం ఏంచేశామో అసెంబ్లీలో చర్చిద్దాం.. సిద్ధమా? అని KCRకు CM రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సంగారెడ్డిలో నిర్వహించిన సభలో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 37 నెలల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేశామని తెలిపారు. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి రూ.90వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రైతు రుణమాఫీతో పాటు ఉచిత విద్యుత్‌ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

జిమ్ చేసేవారు జాగ్రత్త!
Health· 16 Aug 2026

జిమ్ చేసేవారు జాగ్రత్త!

జిమ్ చేసేవారికి అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి అలర్ట్! బాడీ బిల్డింగ్ కోసం అవసరానికి మించి ప్రొటీన్ తింటే మేలు కంటే డేంజరే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రెజర్ పడి పాడైపోయే ఛాన్స్ ఉంది. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం, హై బిపి, లివర్ ప్రాబ్లమ్స్‌తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్స్ తింటూ, డైటీషియన్ సలహా తీసుకోవడం బెటర్.

Coffee ఎప్పుడు తాగాలి?
Education· 15 Aug 2026

Coffee ఎప్పుడు తాగాలి?

నిద్ర లేవగానే కళ్లు కూడా పూర్తిగా తెరవకముందే కాఫీ కప్పు చేతిలోకి వచ్చేస్తుందా..? ☕ అయితే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్. లేచిన వెంటనే మన బాడీలో కార్టిసోల్ లెవల్స్ ఎక్కువగా ఉండి సహజంగానే అలర్ట్‌గా ఉంచుతాయి. అందుకే లేచిన 60–90 నిమిషాల తర్వాత, సాధారణంగా ఉదయం 9–11 మధ్య కాఫీ తాగితే బెటర్ అని చెబుతున్నారు. అలాగే రోజుకు 400mg కెఫిన్ దాటకుండా చూసుకోవాలి. రాత్రి మంచి నిద్ర కావాలంటే బెడ్‌టైమ్‌కు 6–8 గంటల ముందే కాఫీకి బ్రేక్ ఇవ్వడం మంచిదట.

AI కొత్త వైరస్‌లను తయారు చేసిందా? 🧬
Science· 15 Aug 2026

AI కొత్త వైరస్‌లను తయారు చేసిందా? 🧬

అమెరికాలోని రీసెర్చర్లు AIని ఉపయోగించి ప్రకృతిలో కనిపించని బాక్టీరియోఫేజ్‌లను రూపొందించారు. ఇవి మనుషులను లక్ష్యంగా చేసుకునేవి కాకుండా బ్యాక్టీరియాపైనే పనిచేసే వైరస్‌లు. 2026లో జరిగిన ఈ రీసెర్చ్‌లో AI రూపొందించిన నమూనాల్లో కొన్ని ల్యాబ్‌లో పనిచేయగా, వాటిలో 16 వైరస్‌లు ఈ.కోలి బ్యాక్టీరియాను చంపగలిగాయి. మందులకు తట్టుకునే బ్యాక్టీరియాపై భవిష్యత్తులో ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ టెక్నాలజీపై భద్రతకు సంబంధించిన చర్చ కూడా మొదలైంది. ఇవి భవిష్యత్తులో కొత్త చికిత్సలకు ఉపయోగపడతాయని అనుకుంటున్నారా?

స్వీట్లు తిన్న వెంటనే దాహం..ఎందుకు?
Infotainment· 15 Aug 2026

స్వీట్లు తిన్న వెంటనే దాహం..ఎందుకు?

స్వీట్లు తిన్న వెంటనే చాలామందికి దాహం వేస్తుంది. ఎందుకో తెలుసా? మన రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల. దీన్నే ‘hyperglycemia’ అంటారు. స్వీట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఇది రక్తంలోని నీటిని లాగుతుంది. దీంతో శరీర కణాల నుంచి నీరు రక్తంలోకి వెళ్తుంది. శరీరం డీహైడ్రేటెడ్ అయినట్టు అనిపించి దాహం వేస్తుంది. ఎక్కువగా ఉప్పు ఉన్న పదార్థాలు తిన్నా దాహం పెరుగుతుంది. అయితే ఏదైనా తిన్న వెంటనే నీరు తాగకూడదని, కాసేపు ఆగాక తాగాలని నిపుణులు చెబుతున్నారు.

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం
Infotainment· 15 Aug 2026

‘లౌకిక భారతం కోసం గాంధీ’ పుస్తకం

ప్రజాశక్తి బుక్‌హౌస్ ‘లౌకిక భారతం కోసం గాంధీ’ పేరుతో వ్యాసాల పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, సుకుమార్ మురళీధరన్, బిపిన్ చంద్ర, కుంకుం సంఘారి, రవీందర్ కుమార్ లాంటి వారు రాసిన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. అహింసా మార్గంలో ప్రజలను కదిలించిన రాజకీయ వ్యూహకర్తగా గాంధీ, కులవ్యవస్థ, మహిళా స్వేచ్ఛ, మతాల మధ్య ఐక్యత, లౌకికత్వం వంటి అంశాలపై గాంధీ అభిప్రాయాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. దీని ధర ₹100. పుస్తకాన్ని <a href="https://navatelanganabooks.com/book/%e0%b0%b2%e0%b1%8c%e0%b0%95%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-loukika-bhartham-kosam/">ఇక్కడ </a>కొనొచ్చు.

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?
Technology· 15 Aug 2026

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?

ఇప్పుడు రోజుకు ఎన్నో Calls చేస్తుంటాం.. కానీ మొబైల్ చరిత్రలో మొదటి కాల్ ఎవరికి చేశారో తెలుసా? 😏 1973 ఏప్రిల్ 3న Motorola ఇంజనీర్ మార్టిన్ కూపర్ న్యూయార్క్‌లోని ఓ వీధి నుంచి ప్రపంచంలోనే తొలి హ్యాండ్‌హెల్డ్ మొబైల్ కాల్ చేశారు. ఆశ్చర్యంగా.. ఆయన కాల్ చేసింది తన ప్రత్యర్థి సంస్థ Bell Labs ఇంజనీర్ జోయెల్ ఎంగెల్‌కే! అప్పటి Motorola DynaTAC ప్రోటోటైప్ దాదాపు 1 కిలో బరువు ఉండేది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 20–30 నిమిషాలే మాట్లాడగలిగేది. ఆ ఒక్క కాల్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌లో కొత్త శకం మొదలైంది.📱

తెలుగులో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పుస్తకం
Infotainment· 15 Aug 2026

తెలుగులో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పుస్తకం

రాజకీయాలు, గూఢచర్యం, సెక్స్ వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతం తెలిసిందే. సముద్రం మధ్య అతడు సృష్టించిన దీవిలో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు జరిగాయని అనేక వార్తలు వచ్చాయి. ఈ అంశాలన్నీ వివరిస్తూ.. వ్యవస్థ వైఫల్యాలను ఎండగడుతూ రచయిత కృష్ణ కానూరి ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అనే పుస్తకం రాశారు. ప్రజాశక్తి బుక్‌హౌజ్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీని ధర రూ.200/-.

‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?
Current Affairs· 15 Aug 2026

‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?

హైదరాబాద్ మెట్రో మార్గంలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ ఒకటి. చైతన్యపురి, ఎల్బీనగర్ స్టేషన్ల మధ్యలో ఉండే స్టేషన్ ఇది. ‘విక్టోరియా మెమోరియల్’ చరిత్రేమిటో తెలుసా? 1901లో హైదరాబాద్ నిజాం మహబూబ్ అలీ ఖాన్ సరూర్‌నగర్‌లో ‘మహల్-ఎ-సరూర్‌నగర్’ అనే భవన నిర్మాణం మొదలుపెట్టి, అసంపూర్తిగా వదిలేశారు. 1901 జనవరిలో క్వీన్ విక్టోరియా మరణించారు. అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్ బార్ నిజాంను కోరి, ఆ భవనాన్ని పూర్తి చేసి ‘Victoria Memorial Orphange’గా మార్చారు. ఇప్పటికీ అది విక్టోరియా మెమోరియల్ హోమ్‌గా కొనసాగుతోంది.

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬
Science· 15 Aug 2026

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬

మన DNAలో రోజూ ఎన్నో చిన్నచిన్న నష్టాలు జరుగుతుంటాయి. వాటిని మన శరీరంలోని కణాలు సహజంగానే రిపేర్ చేస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ రిపేర్ సామర్థ్యం తగ్గడం వల్ల DNAలో నష్టం పేరుకుపోవచ్చు. అందుకే DNAను మరింత సమర్థంగా రిపేర్ చేయగలిగితే వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చా అనే దానిపై రీసెర్చ్ జరుగుతోంది. 2026లో వచ్చిన కొత్త రీసెర్చ్‌లు కూడా DNA రిపేర్, దీర్ఘాయుష్షు మధ్య సంబంధంపై దృష్టి పెడుతున్నాయి. అయితే మనుషుల జీవితకాలాన్ని పెంచే నిరూపితమైన చికిత్స ఇంకా లేదు.

కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
Current Affairs· 15 Aug 2026

కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తన తండ్రి గురించి, తమ మతవిశ్వాసాల గురించి ఆమె వివరించారు. తన తండ్రి ఇష్టంతో ఇస్లాంలోకి మారారని, తన ఎప్పుడూ ఇస్లాంలోని మంచిని చూశానని చెప్పారు. తనను ద్వేషించేవాళ్లకు సైతం మంచి జరగాలనే తను కోరుకుంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇటీవల బోనాల పండగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి గొప్పతనం, బోనాల గురించి ఆమె మాట్లాడిన <a href="https://www.theclearcutnews.com/n/eVQ3VXD">మాటలు</a> వైరల్ అయ్యాయి.

స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు
Local· 15 Aug 2026

స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

TG: పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అమరధామంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరైనప్పటికీ కార్యక్రమం ప్రారంభ సమయంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.