స్వీట్లు తిన్న వెంటనే దాహం..ఎందుకు?

స్వీట్లు తిన్న వెంటనే చాలామందికి దాహం వేస్తుంది. ఎందుకో తెలుసా? మన రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల. దీన్నే ‘hyperglycemia’ అంటారు. స్వీట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఇది రక్తంలోని నీటిని లాగుతుంది. దీంతో శరీర కణాల నుంచి నీరు రక్తంలోకి వెళ్తుంది. శరీరం డీహైడ్రేటెడ్ అయినట్టు అనిపించి దాహం వేస్తుంది. ఎక్కువగా ఉప్పు ఉన్న పదార్థాలు తిన్నా దాహం పెరుగుతుంది. అయితే ఏదైనా తిన్న వెంటనే నీరు తాగకూడదని, కాసేపు ఆగాక తాగాలని నిపుణులు చెబుతున్నారు.



