Latest

Gen Z కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
BJP Ex ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబల్పూర్లో ఫస్ట్ టైమ్ తన రెసిగ్నేషన్ గురించి ఓపెన్ అయ్యారు. "Gen Z అంతా మనవాళ్లే, కొంతమంది వాళ్లను దారి తప్పించడానికి ట్రై చేశారు. నాకు మంత్రి పదవి అస్సలు ప్రెస్టీజ్ ఇష్యూ కాదు, యూత్ పవర్ ముందు నా బాధ్యత చాలా చిన్నది" అని కామెంట్స్ చేశారు. ఈ రియాలిటీని PM కి వివరించాకే ఆయన స్వయంగా Gen Z తో ఇంటరాక్ట్ అయ్యారని చెప్పారు. దేశ ప్రయోజనాలే తమకు ఫస్ట్ ప్రైయారిటీ అని, యూత్ డ్రీమ్స్ నెరవేర్చడమే తమ టార్గెట్ అని స్పందించారు.

ఫ్యాషన్ ప్రపంచంలో 'రెడ్' హవా..💃
ఇప్పుడు ఫ్యాషన్లో రెడ్ కలర్ ట్రెండ్ నడుస్తోంది. చెర్రీ రెడ్, క్రిమ్సన్, వైన్ షేడ్స్ వేసుకుంటే లుక్ చాలా అట్రాక్టివ్గా, కాన్ఫిడెంట్గా ఉంటుంది. మొత్తం రెడ్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేకపోతే హ్యాండ్బ్యాగ్, చెప్పులు, బెల్ట్, గ్లాసెస్ లేదా లిప్స్టిక్ లాంటి చిన్న మ్యాచింగ్స్ ట్రై చేయొచ్చు. బ్లాక్, వైట్ లేదా జీన్స్ డ్రెస్సులకి ఎర్రటి యాక్సెసరీస్ తోడైతే స్టైలిష్గా కనిపిస్తారు.

జుడోతో మారిన జీవితం..
సైకిల్ మెకానిక్ కూతురైన 23 ఏళ్ల అస్మిత దేయ్, కామన్వెల్త్ గేమ్స్ జుడో 48 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. తీవ్ర గాయాలు, తండ్రి మరణం వంటి ఎన్నో కష్టాలను దాటుకుని ఈ విజయాన్ని అందుకుంది. మట్టి ఇంట్లో పెరిగిన అస్మిత, జుడోనే తనకు క్రమశిక్షణ, పతకాలు, ప్రపంచ గుర్తింపు ఇచ్చిందని తెలిపింది. తన కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టించడమే తన లక్ష్యమని, పట్టుదల ఉంటే ఎంతటి పేదరికాన్నైనా జయించవచ్చని చెప్పింది.

ప్రపంచాన్ని తిరిగేటప్పుడు కొనే క్రేజీ వస్తువులు! 🌍
ప్రయాణాల్లో కొందరు బట్టలు, దాచుకునే జ్ఞాపకాలు మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగపడే వస్తువులను కూడా కొంటుంటారు. మన భారత్లో లభించే 'పుదీన్ హరా' కడుపునొప్పి, అరుగుదల సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. అలాగే హాంకాంగ్లోని వైట్ ఫ్లవర్ ఆయిల్ తలనొప్పికి, కొలంబియా నుండి కొనే కొలోన్లు, ప్యారిస్ కాటన్ బెడ్షీట్లు, గ్రీస్ మట్టి కుండలు, ఇస్తాంబుల్ రగ్గులు, టోక్యోలోని సెకండ్ హ్యాండ్ కెమెరాలను ప్రయాణీకులు ఎంతో ఇష్టపడి కొంటున్నారు.

H-1B వీసా రూల్స్ ఛేంజ్
అమెరికాలో H-1B వీసా హోల్డర్స్కి ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చే ఆలోచనలో ఉంది. జాబ్ పోయిన తర్వాత ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన వెంటనే యూఎస్ విడిచి వచ్చేయాల్సి ఉంటుంది. అమెరికాలోని H-1B వీసా హోల్డర్స్లో 71% మంది భారతీయులే కావడంతో మనవాళ్లపై దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

బీచ్ సీట్ల కోసం ‘టవల్ యుద్ధం’! 🏖️
హాలిడేస్లో బీచ్లు లేదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర మంచి సీట్లు దక్కించుకోవడానికి ముందే టవళ్లు వేసి రిజర్వ్ చేసుకోవడం అలవాటుగా మారింది. సాధారణంగా జర్మన్లే ఇలా ఎక్కువగా చేస్తారని అనుకునేవారు. కానీ కొత్త సర్వే ప్రకారం.. జర్మన్ల కంటే ఇటలీ, ఫ్రాన్స్ దేశస్తులే ఇలా టవళ్లతో ఎక్కువ సీట్లు కబ్జా చేస్తున్నారట! ఇక ఇటలీలోనైతే కొందరు రాత్రికే బీచ్లలో గొడుగులు వేసి స్థలాలు బుక్ చేసుకుంటుండటంతో, అధికారులు ఏకంగా భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు.

స్టైలిష్ గడ్డం వెనుక దాగున్న బ్యాక్టీరియా..
ఈ రోజుల్లో గడ్డం పెంచుకోవడం ఒక ట్రెండీ ఫ్యాషన్గా మారిపోయింది. అయితే గడ్డాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అందులో మురికి, చెమట ఉండడంతో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎంత వాష్ చేసినా మళ్లీ బ్యాక్టీరియా త్వరగానే చేరుతుందని చెబుతున్నాయి. కాబట్టి గడ్డం ఉన్నవారు రోజూ నీట్గా ట్రిమ్ చేసుకోవడంతో పాటు డైలీ వాష్ చేస్తూ క్లీన్గా ఉంచుకోవడం మంచిదని తెలిపారు.

ఇంగ్లాండ్లో 'బాంబే' బైసికిల్ క్లబ్ కథేంటి? 🚴♂️
ఇంగ్లాండ్లోని విర్రాల్కి చెందిన కొందరు ఫ్రెండ్స్ సైక్లింగ్ క్లబ్ పెట్టాలనుకున్నప్పుడు.. ఒక ఇండియన్ 'తండూరి' రెస్టారెంట్లో తింటూ ప్లాన్ చేశారు. ఆ గుర్తుగానే తమ గ్రూప్కి 'బాంబే బైసికిల్ క్లబ్' అని పేరు పెట్టారు. అంతేకాదు, గ్రాఫిక్ డిజైనర్ అయిన తమ ఫ్రెండ్తో మాట్లాడి భారత జెండా రంగులు ఉన్న జెర్సీలను కూడా తయారు చేయించుకున్నారు. ఇంగ్లాండ్ వీధుల్లో మన జెండా రంగులతో వీరు వెళ్తుంటే అందరూ ఇంట్రెస్ట్గా చూశారట.

సైక్లింగ్ గ్రూప్ ఫ్రెండ్స్ సాధించిన 10 ఏళ్ల మైలురాయి!🚴♂️
2016 ఇంగ్లాండ్లో స్నేహితులంతా కలిసి చిన్నగా ప్రారంభించిన సైక్లింగ్ ప్రయాణం నేడు పదేళ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో కేవలం 11 మైళ్ల దూరంతో సరదాగా మొదలైన వీరి ప్రయాణం, ఆ తర్వాత 'బాంబే బైసికిల్ క్లబ్'గా మారింది. భారత జాతీయ జెండా రంగులతో కూడిన ప్రత్యేక జెర్సీలు ధరించి వీరు సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల చనిపోయిన తమ తోటి మిత్రుడు క్రిస్ లెవిస్ జ్ఞాపకార్థం, పదేళ్ల మైలురాయి సందర్భంగా వీరంతా కలిసి మళ్లీ లివర్పూల్ సైకిల్ రైడ్లో పాల్గొని వాళ్ల బాండింగ్ని చూపెట్టారు.

వర్కౌట్ డ్రెస్సులతో పెరిగే ఆత్మవిశ్వాసం! 🏋️♀️
వర్కౌట్ చేసేటప్పుడు మనం వేసుకునే బట్టలు మనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. జిమ్ లేదా జుంబా డ్యాన్స్ కి వెళ్లేటప్పుడు శరీరానికి కంఫర్టబుల్గా ఉండే సరైన స్పోర్ట్స్ వేర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. నడుము దగ్గర లూజ్ కాకుండా ఉండే లెగ్గింగ్స్, కంఫర్టబుల్ స్పోర్ట్స్ వేర్ వేసుకోవడం వల్ల వర్కౌట్ చేసేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. సరైన ఫిట్టింగ్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే వర్కౌట్ మీద దృష్టి పెట్టడానికి, వర్కౌట్ని ఎంజాయ్ చేయడానికి బాగా సహాయపడతాయి.

విదేశీ ప్రయాణాల్లో కొనే కొత్త వింతలు! ✈️
మనం వేరే ఊరు లేదా విదేశాలు వెళ్లినప్పుడు సాధారణంగా జ్ఞాపకం కోసం ఫ్రిజ్ మాగ్నెట్లు కొంటూ ఉంటాం. కానీ ప్రయాణ నిపుణులు ఏమంటున్నారంటే... అలాంటి వాటి కంటే అక్కడ దొరికే ప్రత్యేకమైన దుస్తులు, టీ పొడి, ఆలివ్ ఆయిల్, కాఫీ గింజలు, అక్కడి స్వీట్స్ కొనడం చాలా మేలని చెప్తున్నారు. ఆయా దేశాల సంస్కృతిని, అక్కడి రుచులను ఇంటికి తెచ్చుకుని ఆస్వాదించడమే నిజమైన ప్రయాణ ఆనందం అని అంటున్నారు.

US వైస్ ప్రెసిడెంట్కి మోదీ విషెస్!
US వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ప్రధాని <a href="https://x.com/narendramodi/status/2086143126729584815?s=20">నరేంద్ర మోదీ</a>కి ఫోన్ చేశారు. ఈ కాల్లో ఇండియా-యూఎస్ కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ను మరింత స్ట్రాంగ్ చేయడంపై వీరిద్దరూ డిస్కస్ చేశారు. అలాగే జేడీ వాన్స్ దంపతులకు బాబు పుట్టడంతో PM మోదీ వాళ్లకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

🌿 తులసి.. ఆరోగ్యానికి మేలు!
తులసి ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, శ్వాస సంబంధ సమస్యల్లో ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడతాయని, అలాగే జీర్ణక్రియ మెరుగుపడటానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని అంటున్నారు. ఉదయాన్నే తులసి ఆకులు లేదా తులసి నీరు తీసుకోవడం మంచిదని తెలిపారు.
యష్ ఒక్క కాల్ చేయగానే వచ్చా- నయనతార
సాధారణంగా ప్రమోషనల్ ఈవెంట్స్కి దూరంగా ఉండే నయనతార, 'టాక్సిక్' మూవీ ఈవెంట్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు ప్రమోషనల్ ఈవెంట్స్ మాట్లాడటం సరిగ్గా రాదని, అందుకే దూరంగా ఉంటానని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే రాకింగ్ స్టార్ యష్ ఒకే ఒక్క కాల్ చేసి అడగ్గానే ఈ ఈవెంట్కి వచ్చానని చెప్పారు. టీమ్ విజన్, ప్రొడ్యూసర్ వెంకట్ గారి సపోర్ట్ వల్లే ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్గా మారిందని నయనతార చెప్పారు.

60 ఏళ్లు దాటాక ఇవి తగ్గించండి!
60 ఏళ్లు దాటిన తర్వాత ఆహారం విషయంలో జాగ్రత్త అవసరమని డాక్టర్లు అంటున్నారు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, ప్రాసెస్డ్ మాంసం, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం, మైదా పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, పాపడ్, ప్యాకెట్ స్నాక్స్ తగ్గించడం మంచిదని చెబుతున్నారు. వీటికి బదులుగా కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు తీసుకోవాలని తెలిపారు.

🧘 సైనస్కు యోగా.. డాక్టర్ల సూచన!
సైనస్ సమస్యతో ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖంలో ఒత్తిడి వంటి ఇబ్బందులు ఉంటే యోగా కొంత ఉపశమనం ఇవ్వొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధోముఖ శ్వానాసనం, భుజంగాసనం, సేతు బంధాసనం, ఉత్తానాసనం వంటి ఆసనాలు ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. జల నేతి కూడా ముక్కు మార్గాలను శుభ్రం చేయడంలో సహాయపడొచ్చని అంటున్నారు. అయితే సరైన పద్ధతిలోనే చేయాలని తెలిపారు.

ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి?
భారత్లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పశ్చిమాసియా టెన్షన్స్, మార్కెట్ పరిస్థితుల వల్ల గోల్డ్కి డిమాండ్ మళ్లీ పెరిగింది. ఆగస్టు 5న ₹1,44,000గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర ఈ నాలుగు రోజుల్లో ఏకంగా ₹8 వేలకు పైగా పెరిగింది. నేడు హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹1,52,350గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,39,650 కాగా, 18 క్యారెట్ల రేట్ ₹1,14,260 వద్ద ఉంది. గోల్డ్ ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి, కోనాలనుకునేవారు రేట్స్ చెక్ చేసుకోవడం బెట్టర్.

తగ్గిన చికెన్ ధరలు?
హైదరాబాద్లో ఈరోజు బోనాల పండుగ ఉన్నా కూడా చికెన్ ధరలు బాగా తగ్గాయి. రిటైల్ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో ₹240 నుంచి ₹260 వరకు అమ్మితే, కోడి (లైవ్ బర్డ్) కిలో ₹137గా ఉంది. అలాగే స్కిన్తో ఉన్న చికెన్ కిలో ₹212కి లభిస్తోంది. ఫారమ్ దగ్గరైతే లైవ్ బర్డ్ కిలో కేవలం ₹110 మాత్రమే. మరోవైపు షాపుల్లో గుడ్డు ధర ₹7 నుంచి ₹8 మధ్యలో ఉంది.

కూరగాయలు తింటున్నా నీరసంగా ఉంటోందా?
మనం రోజూ కూరగాయలు తింటున్నా అందులోని పోషకాలన్నీ మన శరీరానికి నేరుగా అందవు. టమోటోల్లో ఉండే లైకోపీన్ శరీరానికి బాగా పట్టాలంటే కొద్దిగా ఆయిల్ లేదా కొబ్బరి లాంటి వాటితో కలిపి వండాలి. బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉన్నా, శరీరం దాన్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్-సి (నిమ్మకాయ, ఉసిరి) జత చేయాలి. గ్రీన్ టీలో కొన్ని నిమ్మచుక్కలు పిండితే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా పడతాయి. ఇలా చిన్న మార్పులతో పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

‘రుద్ర’గా మహేష్ బాబు.. ఫస్ట్ లుక్ అవుట్!
మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న ‘వారణాసి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’, ‘శ్రీరాముడు’గా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 'రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు' అనే క్యాప్షన్తో రుద్ర క్యారెక్టర్ను పరిచయం చేశారు. ఎప్పుడూ క్లాస్ లుక్లో కనిపించే మహేష్.. ఇందులో ఒత్తైన జుట్టు, గెడ్డంతో రగ్గడ్ అడ్వెంచరర్ లుక్లో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు.. ఇద్దరి కండిషన్ సీరియస్!
అనంతపురం జిల్లా పామిడి మండలం పోగూరు దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఘోరమైన యాక్సిడెంట్కి గురైంది. ఓవర్ స్పీడ్తో వెళ్తున్న ఈ బస్, ఎదురుగా వస్తున్న ఐచర్ వెహికల్ని డైరెక్ట్గా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్కి బస్ కంట్రోల్ తప్పి హైవే పక్కనే ఉన్న కల్వర్టు పైనుంచి కింద పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో 18 మంది ప్యాసింజర్స్కి సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి. బస్, ఐచర్ డ్రైవర్లు క్యాబిన్లోనే ఇరుక్కుపోవడంతో.. పోలీసులు, స్థానికులు వాహనం భాగాలను కట్ చేసి వాళ్లని బయటికి తీశారు. ప్రజెంట్ ఇద్దరి కండిషన్ సీరియస్గా ఉంది.