Latest

సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్
Local· 5d ago

సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఐదుగురు సభ్యులు సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్‌తో పాటు సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!
Local· 5d ago

స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!

నాగర్ కర్నూల్ లింగాల మండలంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అచ్చంపేట MLA డా. చిక్కుడు వంశీకృష్ణ ఈ వేడుకలో పాల్గొన్నారు. "నేను MLAగా మాత్రమే కాదు, మీ ఇంటి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటా" అని ప్రజలకు హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, నాగేశ్వరరావు, MRO వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్ కార్డుల్లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల చాలామంది రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ
Local· 5d ago

అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ

పెద్దపెల్లి జిల్లా రామగుండం అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి కాలం ముగియడంతో కొత్తగా అధ్యక్ష పదవి పోటీకి సీనియర్ జూనియర్ నాయకులు పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించటం పారిశ్రామిక ప్రాంతంలో చర్చగా మారింది. దరఖాస్తుల స్వీకరించిన ఏఐసీసీ నాయకులు వాటిని పరిశీలించి అందరి నేతల సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొంతమంది సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి అని పారిశ్రామిక ప్రాంతంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

20 ఏళ్ల పోరాటానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతు!
Local· 5d ago

20 ఏళ్ల పోరాటానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతు!

కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని పోరపేటలో ప్రజలు 20 ఏళ్లుగా రోడ్డు కోసం పోరాడుతున్నారు. వారి ఆందోళనకు ఇప్పుడు MLC అభ్యర్థి GV సుందర్ మద్దతు ప్రకటించారు. ఆదివారం ఆ గ్రామంలో గ్రామస్తులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. "మీరు చేస్తున్న ఈ పోరాటంలో నేను కూడా పాల్గొంటాను. రోడ్డు వేసే వరకు నేను పోరపేటలోనే బస చేస్తా" అని ప్రకటించారు. వానొస్తే నడక మార్గం కూడా పాడైపోతున్నదని, వైద్య అత్యవసరాలు, పిల్లల స్కూల్ రాకపోకలు, పంటల రవాణా – వీటన్నింటకీ కష్టంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

తమ్ముడి భుజాలపై చెల్లెలు.. నేపాల్ కన్నీటి కథ!
International· 5d ago

తమ్ముడి భుజాలపై చెల్లెలు.. నేపాల్ కన్నీటి కథ!

నేపాల్‌లో ప్రకృతి విపత్తు సృష్టించిన దృశ్యం.. ఓ చిన్నారి తన చెల్లెల్ని భుజాలపై ఎత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాడు. ఆగస్టు 26న ఉత్తర, మధ్య నేపాల్లో వరదల వల్లఇప్పటివరకు 900 మందికి పైగా మృతి చెందగా, వేల మంది ఇంకా గల్లంతయ్యారు. గుర్తుపట్టలేని మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. X (ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరి ముఖాల్లో గాయాలు, చేతుల్లో గీతలు. పెద్దవాడి ముఖంలో భయం, చెల్లెలి కళ్లలో ఆశ. వారు తమ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు. ఇది చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కాలేజీకి కాంపౌండ్ వాల్ లేదు.. భద్రత సంగతి?
Local· 5d ago

కాలేజీకి కాంపౌండ్ వాల్ లేదు.. భద్రత సంగతి?

నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కాంపౌండ్ వాల్ లేదు. దీంతో బయటి వ్యక్తులు కాలేజీ ఆవరణలోకి స్వేచ్ఛగా వస్తున్నారు. విద్యార్థినులు భద్రత లేకుండా ఉండటంతో పాటు, విద్యా వాతావరణం కూడా దెబ్బతింటోంది. దీనిపై AIPSU (ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్) నిర్మల్ జిల్లా కమిటీ సహకారంతో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ (IAS)కి కంప్లయింట్ ఇచ్చారు. "వెంటనే నిధులు మంజూరు చేసి, కాంపౌండ్ వాల్ నిర్మించాలి" అని జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు.

రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి
Local· 5d ago

రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి గద్వాల్ భీమ్‌నగర్‌లోని రాఘవేంద్రస్వామి దేవాలయం సందర్శించి పూజలు నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఉత్తరారాధన పురస్కరించుకొని న్యాయమూర్తి దేవాలయం సందర్శించుకున్నారు. కార్యక్రమంలో మన్నూరు ప్రహ్లాద చారి ప్రమోద్ ప్రసన్న, సీనియర్ న్యాయవాది భీమ్‌సేనరావు పాల్గొన్నారు.

జోగులాంబ సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Local· 5d ago

జోగులాంబ సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ అర్చకులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.

పేద అమ్మాయి పెళ్లికి రూ.5,000.. ఆదుకున్న పంచాయతీ కార్యదర్శి!
Local· 5d ago

పేద అమ్మాయి పెళ్లికి రూ.5,000.. ఆదుకున్న పంచాయతీ కార్యదర్శి!

జన్నారం మండలం చింతగూడలో ఓ హృదయాన్ని కదిపే ఘటన జరిగింది. నిరుపేద యువతి బిస్కుల మానస వివాహ ఖర్చుల కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్ళెం రాజన్న స్వంత డబ్బులు రూ.5,000 అందజేశారు. ఈ చొరవను స్థానిక నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్, కాంగ్రెస్ కార్యదర్శి మాణిక్యం, తాటి శ్రీనివాస్, అరె లింగమూర్తి అభినందించారు. ఇలాంటి స్ఫూర్తిదాయక పనులు నిరుపేద కుటుంబాలకు పెద్ద ఊరటగా ఉంటాయి. మీరు కూడా మీ ఊర్లో ఇలాంటి మంచి పనులు జరిగితే మాకు తెలియజేయండి.

తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...
Local· 5d ago

తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...

Dr.BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్టణంలో కుళాయిల్లో దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. సుందరమ్మ చేరువుగట్టు ప్రాంతంలో 2 days కి ఒకసారి, 1/2 గంట మాత్రమే నీరు వస్తోంది. అయితే అవి తాగేందుకు పనికిరావు నీటి పైపులైన్లకు, మురుగు కాలువలకు మధ్య లీకేజీలు ఉండటమే కారణం. రిపేర్లు సరిగా చేయకపోవడంతో మురుగు నీరు తాగునీటి లైన్లలోకి కలుస్తోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాలో 30 గ్రామాలకూ తాగునీటి కష్టాలున్నాయి. జిల్లాలో 676 RO ప్లాంట్లు ఉంటే, 302 పనిచేయడం లేదు.

New Yorkలో జెండాకు అవమానం.. కిరణ్ రిజిజు వార్నింగ్!
National· 5d ago

New Yorkలో జెండాకు అవమానం.. కిరణ్ రిజిజు వార్నింగ్!

న్యూయార్క్‌లో ఇండియా జెండాను అవమానించారనే ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను<a href="https://x.com/KirenRijiju/status/2094072645960511847"> 'ఎక్స్‌'లో</a> షేర్ చేసిన ఆయన.. దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే 'భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అంటూ వార్నింగ్ ఇచ్చారు. మోహన్ భాగవత్ పాల్గొన్న మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ సభ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. RSS లేదా BJPని విమర్శించే హక్కు ఉందని, కానీ దేశాన్ని అవమానించొద్దని రిజిజు అన్నారు.

వరదల్లో 6ఏళ్ల చిన్నారి ఎలా బతికిందంటే?
International· 5d ago

వరదల్లో 6ఏళ్ల చిన్నారి ఎలా బతికిందంటే?

నేపాల్‌లో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల 650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, రసువా డిస్ట్రిక్ట్ తిమూరేలో ఒక మిరాకిల్ జరిగింది. వరద ధాటికి కొట్టుకొచ్చిన మట్టి, డెబ్రీస్ కింద 3 రోజులుగా చిక్కుకుపోయిన ఒక 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆర్మ్‌డ్ పోలీస్ టీమ్ సెర్చ్ చేస్తున్న టైమ్‌లో మట్టి కింద నుండి ఏడుపు వినిపించడంతో వెంటనే తవ్వి పాపను కాపాడారు. కండిషన్ సీరియస్‌గా ఉండటంతో బెటర్ ట్రీట్‌మెంట్ కోసం పాపను ఖాట్మండులోని హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

డాక్టర్లు సంతకాలు చేసి.. క్లినిక్కులకా? MLA షాక్!
Local· 5d ago

డాక్టర్లు సంతకాలు చేసి.. క్లినిక్కులకా? MLA షాక్!

శ్రీకాకుళం జిల్లా పలాస Govt హాస్పిటల్లో సోమవారం MLA గౌతు శిరీష సర్ప్రైజ్ చెకింగ్ చేశారు.<br>వైద్యులు సంతకాలు చేసి ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సమయాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గరుడఖండి వద్ద ప్రమాదానికి గురైన 5గురు ఉపాధ్యాయులకు సకాలంలో వైద్యం అందలేదనే ఫిర్యాదులపైనా ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వైద్యులు వివరణ ఇవ్వాలని, సోమవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మరి మీఊళ్లో ఎలా ఉంది? comment please.

EMI కట్టలేకపోతే వెంటనే ఈ పని చేయండి!
Current Affairs· 5d ago

EMI కట్టలేకపోతే వెంటనే ఈ పని చేయండి!

ఇల్లు, కార్, బిజినెస్ లోన్ EMIలు టైమ్‌కి కట్టకపోతే బ్యాంకులు లేట్ ఛార్జీలు వేస్తాయి. ఒక్క EMI మిస్ అయినా మెసేజ్ ఇచ్చి అలర్ట్ చేస్తారు. 90 రోజులు దాటితే ఆ లోన్ అకౌంట్‌ను డేంజర్ జోన్ (NPA)లో పెడతారు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతిని భవిష్యత్తులో లోన్స్, క్రెడిట్ కార్డ్స్ రావడం కష్టమవుతుంది. అందుకే ఈ ప్రాబ్లమ్ రాకముందే బ్యాంక్‌ను విజిట్ చేసి మాట్లాడి, EMI కట్టే డేట్ మార్చుకోవాలి. కొత్త లోన్ తీసి పాత EMIలు కడితే ప్రాబ్లమ్ ఇంకా పెద్దదవుతుంది.

రహ్మత్ బేగ్ ఎపిసోడ్.. మజ్లిస్‌కు కొత్త టెన్షన్!
Crime· 5d ago

రహ్మత్ బేగ్ ఎపిసోడ్.. మజ్లిస్‌కు కొత్త టెన్షన్!

TG: మజ్లిస్ MLC రహ్మత్ బేగ్ ఇష్యూ పార్టీకి హెడ్‌ఏక్‌గా మారింది. ఓ బాలికను సెక్సువల్ అబ్యూజ్‌ చేశారనే అలిగేషన్స్‌కు పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. MLC పదవికి రిజైన్ చేయాలని ఆదేశించింది. మూడు రోజులు గడిచినా ఆయన రాజీనామా చేయలేదు. తాను 'ఎట్టి పరిస్థితుల్లోనూ రిజైన్ చేయను' అని రహ్మత్ బేగ్ అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

సెప్టెంబర్ మొత్తం.. పోలీస్ యాక్ట్ లో జగిత్యాల!
Local· 5d ago

సెప్టెంబర్ మొత్తం.. పోలీస్ యాక్ట్ లో జగిత్యాల!

జగిత్యాల జిల్లాలో Sept 1 నుంచి 30 వరకు పోలీస్ Act –1861 అమల్లోకి వస్తోంది. SP అశోక్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. డీజేలు వాడొద్దు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించొద్దు. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం (Act V of 1861). నేటికీ అమల్లో ఉంది. ఇందులోని Sec-30 ప్రకారం, ప్రజా భద్రత కోసం పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధించవచ్చు. అయితే ఎక్కువ సార్లు ప్రజాభద్రత పేరిట, నిరసనలను అణిచివేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.

ISROలో జాబ్స్.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఛాన్స్!
Jobs· 5d ago

ISROలో జాబ్స్.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఛాన్స్!

ISRO-ICRB Scientist/Engineer ‘SC’ పోస్టులకు 175 వేకెన్సీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Electronics, Mechanical, Computer Science డిపార్ట్‌మెంట్స్‌లో పోస్టులున్నాయి. B.E/B.Techలో మినిమమ్ 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ సెప్టెంబర్ 16, 2026 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 16, 2026తో అప్లికేషన్స్ ముగుస్తాయి . అప్లికేషన్ ఫీజు రూ.250 (ప్రాసెసింగ్ ఫీజు రూ.750 ముందుగా చెల్లించాలి). పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/102146/Index.html">'Click'</a> చేయండి.

ఎమ్మెల్యే సర్ప్రైజ్ చెక్.. ఆసుపత్రి అంతా OKనా?
Local· 5d ago

ఎమ్మెల్యే సర్ప్రైజ్ చెక్.. ఆసుపత్రి అంతా OKనా?

అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సోమవారం నాడు పదర మండల ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. వార్డులు, ఔట్ పేషెంట్ విభాగం, ఫార్మసీ – అన్నీ చూశారు. మందులు ఉన్నాయా? సిబ్బంది హాజరు ఎలా ఉంది? పారిశుద్ధ్యం బాగుందా? అని అడిడి తెలుసుకున్నారు. ప్రతీ డీటెయిల్ పరిశీలించారు. పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి చెప్పారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి? మందులు అందుబాటులో ఉన్నాయా? కామెంట్ షేర్ చేయండి.

స్కూల్ మునిగిపోయింది... కానీ 1,643 మంది సేఫ్!
International· 5d ago

స్కూల్ మునిగిపోయింది... కానీ 1,643 మంది సేఫ్!

నేపాల్‌లోని త్రిశూలి నదిలో 30 మీటర్ల ఎత్తులో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ త్రిభువన్ త్రిశూలి స్కూల్‌ను ముంచెత్తాయి. ప్రిన్సిపాల్ రాజేంద్ర దాదాబీ సమయస్ఫూర్తితో 1,643 మంది స్టూడెంట్స్ సేఫ్‌గా బయటపడ్డారు. ఊరు కొట్టుకుపోతోందని ఫ్రెండ్ నుండి అలర్ట్ రాగానే, ఆయన వెంటనే స్కూల్ బెల్ కొట్టి పిల్లలను ఎత్తైన ప్రదేశానికి పంపారు. వస్తున్న స్కూల్ బస్ డ్రైవర్లకు ఫోన్ చేయడంతో, బ్రిడ్జ్ కూలిపోయే ముందే బస్ సేఫ్‌గా క్రాస్ అయింది. దాదాబీ చూపిన సమయస్ఫూర్తిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిల్లీలో షాకింగ్ ఘటన.. కదులుతున్న బస్‌లో బాలికపై దారుణం!
Crime· 5d ago

దిల్లీలో షాకింగ్ ఘటన.. కదులుతున్న బస్‌లో బాలికపై దారుణం!

UPకి చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న స్లీపర్ బస్‌లో ఇద్దరు వ్యక్తులు సెక్సువల్ అబ్యూజ్‌ చేశారని పోలీసులు తెలిపారు. భారీ వర్షంలో దారి తప్పిన బాలిక.. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద బస్ ఎక్కినట్లు తెలుస్తోంది. 47 కి.మీ. జర్నీలో ఈ ఘటన జరిగినట్లు కేసు నమోదైంది. తరువాత కశ్మీరీ గేట్ దగ్గరలో బాలికను వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు. అధికారులు CCTV ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి, బస్‌ను ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపించారు. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది.

వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!
Local· 5d ago

వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!

పల్నాడు దాచేపల్లి రైతులకు వర్షమే పెద్ద టెన్షన్‌గా మారింది. మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నీళ్లు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. ఇలాగే కొనసాగితే పంట నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్లో ధర కూడా రాదు. ఇది రైతులకు రెట్టింపు నష్టం! ఎపి మొత్తం ఇదే పరిస్థితి. ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో 52% వర్షపాతం లోటు నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా 13% లోటే. ఐఎండీ అంచనా ప్రకారం సెప్టెంబర్లోనూ వర్షాలు తగ్గే అవకాశమే ఉంది. మీ ఊళ్లో వర్షాలు, పంటల పరస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి.