దిల్లీలో షాకింగ్ ఘటన.. కదులుతున్న బస్లో బాలికపై దారుణం!

UPకి చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న స్లీపర్ బస్లో ఇద్దరు వ్యక్తులు సెక్సువల్ అబ్యూజ్ చేశారని పోలీసులు తెలిపారు. భారీ వర్షంలో దారి తప్పిన బాలిక.. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద బస్ ఎక్కినట్లు తెలుస్తోంది. 47 కి.మీ. జర్నీలో ఈ ఘటన జరిగినట్లు కేసు నమోదైంది. తరువాత కశ్మీరీ గేట్ దగ్గరలో బాలికను వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్, కండక్టర్ను అరెస్ట్ చేశారు. అధికారులు CCTV ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి, బస్ను ఫోరెన్సిక్ టెస్ట్కు పంపించారు. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది.



