9th క్లాస్ సిలబస్లో ఎమర్జెన్సీ.. కాంగ్రెస్పై BJP ఫైర్!

9వ తరగతి సోషల్ స్టడీస్ సిలబస్లో 1975 నాటి 'జాతీయ ఎమర్జెన్సీ' చాప్టర్ను NCERT చేర్చింది. ఈ నిర్ణయాన్ని BJP స్వాగతించగా, ప్రతిపక్షాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై BJP అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ కాంగ్రెస్పై తీవ్రంగా మండిపడ్డారు. 1975 జూన్ 25 దేశ చరిత్రలోనే చీకటి రోజు అని, ఇందిరా గాంధీ అధికారాన్ని వాడుకుని ఎమర్జెన్సీ విధించారని, మీడియాపై ఆంక్షలు పెట్టి ఆఖరికి ఆల్ ఇండియా రేడియో నుండి కిషోర్ కుమార్ పాటలను కూడా తొలగించారని విమర్శించారు. అప్పటి నిజాలు నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.



