రెండేళ్ల నుంచి అక్కడ ఆఫీసే స్కూల్

TG: నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని కన్నడ మీడియం ప్రాథమిక పాఠశాల భవనం రెండేళ్ల క్రితం పూర్తిగా కూలిపోయింది. దీంతో పాఠశాలను ఎత్తేయకుండా తాత్కాలికంగా స్థానిక MPDO ఆఫీసులోకి మార్చారు. కార్యాలయంలో ఉన్న నాలుగు గదుల్లో చెరి రెండు గదులను కేటాయించి 45మంది విద్యార్థులతో తరగతులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షల నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా, అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించలేదు. నిధులు ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ప్రారంభం కావడంలేదని స్థానికులు ఫైరవుతున్నారు.



