ఆయిల్ఫెడ్ భూములపై హరీశ్రావు ఫైర్.. CMకు లేఖ!

TG: హైదరాబాద్లోని RTC క్రాస్రోడ్స్, అజామాబాద్లో తెలంగాణ ఆయిల్ఫెడ్కు చెందిన Govt. ల్యాండ్స్పై మాజీ మంత్రి, MLA హరీశ్రావు కీలక ఆరోపణలు చేశారు. రూ. 500 కోట్ల విలువైన భూములను రూ. 87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి కాంగ్రెస్ Govt ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై CM రేవంత్రెడ్డికి ఓపెన్ లెటర్ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇవి హరీశ్రావు చేసిన ఆరోపణలేనని, ప్రభుత్వం వైపు నుంచి ఆఫిషియల్గా క్లారిటీ రావాల్సి ఉంది.



