‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

AP: రాష్ట్ర భూరికార్డులకు శాశ్వత భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలెట్ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించారు. ప్రతి భూభాగానికి ప్రత్యేక డిజిటల్ ఐడీతో టాంపర్-ప్రూఫ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.



