పెట్రోల్ సంక్షోభం.. పాక్లో స్ట్రిక్ట్ రూల్స్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పెట్రోల్ ధరలు పెరగడంతో పాకిస్థాన్ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వాహనాల ఇంధన కేటాయింపును మూడు నెలల పాటు 50 శాతం తగ్గించింది. ప్రభుత్వ ఖర్చుల్లో 5 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలపై మూడు నెలల నిషేధం విధించింది. దుకాణాలు రాత్రి 9 గంటలకు, రెస్టారెంట్లు 11 గంటలకు మూసేయాలి. పెళ్లిళ్లలో ఒకే వంటకం వడ్డించాలని ఆదేశించింది.
