తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్.. కేంద్రం రూ.22 కోట్లు రిలీజ్

TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది యువ అథ్లెట్లు 25 క్రీడల్లో పోటీపడనున్నారు. ఈ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు మరో లోకల్ స్పోర్ట్ను ప్రతిపాదించే ఛాన్స్ కూడా ఇచ్చారు. యంగ్ స్పోర్ట్స్ ప్లేయర్లకు ఇది మంచి ఆపర్చునిటీగా మారనుంది.



