← Back to news

జూడాలకు 5 శాతం స్టైపెండ్ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం

By విశీ· 19 Aug 2026
జూడాలకు 5 శాతం స్టైపెండ్ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం

AP: ప్రభుత్వం 15 శాతం స్టైపెండ్ పెంచాలని కోరుతూ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. విధులకు వెళ్లకుండా సమ్మె చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఇంటర్నీలకు 5 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 3 శాతం పెంచేందుకు నిర్ణయించింది. తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసింది. జనవరి 1 నుంచి ఇంటర్నీలకు ఇది వర్తిస్తుందని, ఆ తర్వాత ఏటా 3 శాతం పెంచుతామని తెలిపింది.

More in AP