E20పై భారీ ఉద్యమం చేస్తాం: రాహుల్ గాంధీ
E20 ఫ్యూయల్ అంశంపై భారీ స్థాయిలో పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, తాము ప్రస్తావించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. E20 ఫ్యూయల్ ప్రజల కార్లు, స్కూటర్లను డ్యామేజ్ చేయడంతో పాటు వారి జీవితాలపై ప్రభావం చూపుతోందని ఆరోపించారు. ప్రజల నుంచి నేరుగా డబ్బులు దోచుకుంటున్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ 'X'లో స్పష్టం చేశారు.



