ఉన్న నీటితోనే పంటలు కాపాడుకోవాలి: ఉత్తమ్

TG: నాగార్జునసాగర్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31 శాతం వర్షపాతం లోటు ఉందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, MBC (మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు.



