కరువు మండలంగా ప్రకటించాలి
AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మహేంద్ర రైతు సంఘం, చైతన్య రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ బి.శ్రీహరికి వినతిపత్రం అందించారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 50 శాతం తక్కువ వర్షాలు కురవడంతో వరినారులు, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులకు తక్కువ కాలంలో పండే వరి విత్తనాలతో పాటు చోడి, కంది, కొర్రలు, సామలు, అరికెలు, పొద్దుతిరుగుడు వంటి పంటల విత్తనాలను ఉచితంగా అందించాలని కోరారు.



