బొత్స వర్సెస్ అచ్చెన్న.. ‘దద్దమ్మ’ పదంతో వేడెక్కిన మండలి

AP: DSC అంశంపై శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, YSRCP నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనిషి పెరిగితే సరిపోదు.. భాష కూడా బాగుండాలి” అని బొత్స అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చేతగాని వాళ్లను ‘దద్దమ్మ’ అంటారని, అది అన్ పార్లమెంటరీ పదం కాదని తిరిగి సమాధానమిచ్చారు. దీంతో DSC అంశంపై మాటల తూటాలు పేలడంతో ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది.



