YSR సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: CM రేవంత్

TG: మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే లీడర్ అని CM రేవంత్ రెడ్డి అన్నారు. YSR వర్ధంతి సందర్భంగా దిల్లీలో ఆయన చిత్రపటానికి (ఫోటో) పూలమాల వేసి నివాళులర్పించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అభివృద్ధి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్తో YSR తనదైన మార్క్ క్రియేట్ చేశారని సీఎం ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కొందరు MPలు పాల్గొన్నారు.



