జైపూర్లో భారీ ఎగ్జామ్ స్కామ్.. నలుగురు అరెస్ట్!
రాజస్థాన్ జైపూర్లో మరో ఎగ్జామ్ స్కామ్ బయటపడింది. పారామెడికల్ డిప్లొమా పరీక్షలో కాపీయింగ్ కొట్టించడానికి ఒక ముఠా పక్కా ప్లాన్ వేసింది. ఇన్విజిలేటర్ల హెల్ప్తో స్టూడెంట్స్ని పాస్ చేయించేందుకు కాలేజీ అడ్మినిస్ట్రేటర్ గ్యాంగ్ ట్రై చేసింది. దీనికోసం స్టూడెంట్స్ నుండి లక్షల్లో డబ్బులు కూడా వసూలు చేశారు. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే పోలీసులు ఎంట్రీ ఇచ్చి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ భారీ మాస్ కాపీయింగ్ కుట్ర ఫెయిల్ అయింది.



