← Back to news

వివాహ వేడుక అనంతరం విషాదం

By dk· 17 Aug 2026· ఏలూరు జిల్లా
వివాహ వేడుక అనంతరం విషాదం

AP: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం లంకలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కుటుంబం వివాహ కార్యక్రమం ముగించుకుని కారులో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి, రోడ్డు పక్కనున్న వాగులో పడిపోయింది. ఘటనలో వనమాల లక్ష్మి(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

More in AP