ఆరు నెలలైనా ఇక్కడే ఉంటాం- అభిజీత్ దిప్కే
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రధాని మోదీ పదవి నుంచి తొలగించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. రైతుల ఉద్యమం (కిసాన్ ఆందోళన్) గెలిచే వరకు ఏడాది పాటు ఎలా సాగిందో, విజయం సాధించే వరకు తమ నిరసన కూడా అలాగే కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ ప్రొటెస్ట్ నెల రోజులు లేదా ఆరు నెలలైనా ఇక్కడే ఉండి కొనసాగిస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆయన మాట్లాడారు.



