ఉద్యోగాల పేరుతో టోకరా

AP: ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ప్లేట్ ఫిరాయించారు. నంద్యాలలో మెడికల్ కోడింగ్ కంపెనీలో ఉద్యోగాల పేరుతో యువతీ, యువకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 700మంది నుంచి డబ్బులు తీసుకుని జాబ్స్ ఇస్తామని చెప్పారు. 3నెలలు వర్క్ఫ్రమ్ హోమ్గా ఉద్యోగం చేయించుకుని సాలరీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఏడునెలలు జీతాలు ఇవ్వకుండా కంపెనీనే ఎత్తేయడంతో వారు షాక్ అయ్యారు. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.



