బాలికల సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ

AP: బాలికల విద్య, సాధికారత, కెరీర్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో "బాలికే భవిష్యత్తు" కార్యక్రమాన్ని మోడల్గా నిర్వహించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన "బాలికే భవిష్యత్తు" కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. బాలికల విద్య, సాధికారత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.



