సీఎం రేవంత్ పర్యటన.. పరకాలలో ట్రాఫిక్ ఆంక్షలు

TG: CM రేవంత్రెడ్డి హన్మకొండ జిల్లాలోని పరకాల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పరకాల CI క్రాంతికుమార్ తెలిపారు. ఇవాళ CM పర్యటన సందర్భంగా పట్టణంలో రద్దీని నియంత్రించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. హుజూరాబాద్, భూపాలపల్లి, హనుమకొండ వైపు వెళ్లే ప్రైవేట్ వాహనదారులు పోలీసుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని కోరారు. మొగుళ్లపల్లి ఎక్స్ రోడ్డు, మాదారం కాలనీ, సీఐఎస్ఐ కాలనీ, జయ్ కాన్వెంట్ స్కూల్ మీదుగా వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు.



