9వ తరగతిలో 'థర్డ్ లాంగ్వేజ్' వద్దన్న సుప్రీంకోర్టు!

9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఈ కీలక దశలో కొత్త లాంగ్వేజ్ నేర్పించడం స్టూడెంట్స్పై ఎక్స్ట్రా ప్రెజర్ పెంచుతుందని కేంద్రానికి సూచించింది. CBSE తీసుకొచ్చిన త్రీ-లాంగ్వేజ్ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఈ కామెంట్స్ చేసింది. చిన్న క్లాసెస్ నుంచే దీన్ని అమలు చేస్తే బెటర్ అని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై తదుపరి విచారణలో కేంద్రం, CBSE తమ డెసిషన్ను చెప్పనున్నాయి.



