← Back to news

నర్సాపూర్-యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం

By Das Prem· 17 Aug 2026· Medak
నర్సాపూర్-యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం

TG: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కోసం నర్సాపూర్-యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్సు సర్వీసును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. నర్సాపూర్-వెల్దుర్తి-తూప్రాన్-గజ్వేల్ మీదుగా యాదగిరిగుట్ట వరకు ఈ బస్సు సర్వీస్ కొనసాగనుంది. భక్తులు, మహిళలు, వృద్ధులకు ఈ బస్సు సర్వీస్ ఉపయోగకరంగా ఉంటుందని రాజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

More in Local