ఖరీదైన మందుల ధరలపై మహిళ న్యాయపోరాటం!

కేరళకు చెందిన 49 ఏళ్ల న్యాయవాది మజీదా ఎంఏ రొమ్ము క్యాన్సర్కు చికిత్స పొందుతున్నారు. ఆమెకు అవసరమైన రిబోసిక్లిబ్ మందుకు నెలకు 75–80 వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. బీమా సాయం నిలిచిపోవడంతో మందుల ఖర్చు భారంగా మారింది. ఖరీదైన క్యాన్సర్ మందులు అందరికీ అందుబాటులో ఉండేలా కేరళ హైకోర్టులో జరుగుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL)లో ఆమె భాగమయ్యారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది.



