← Back to news

మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్

By dk· 8 Aug 2026· అల్లూరిసీతారామరాజు జిల్లా
మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్

AP: అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆదివాసీ సంఘాలు చేపట్టిన మన్యం బంద్ కొనసాగుతోంది. జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించడంతోపాటు స్థానిక గిరిజనులకు 100శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. 1/70 చట్టాన్ని పక్కాగా అమలుచేసి, భూబదలాయింపులను అడ్డుకోవాలని కోరారు. పాడేరులో ఆదివాసీ సంఘాల నేతలు RTC కాంప్లెక్స్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులు, వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. రంపచోడవరం సహా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి.

మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్

More in AP