బయటపడుతున్న యూట్యూబర్ మోసాల చిట్టా

AP: ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. 'నందూస్ వరల్డ్ పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తదితర ఏరియాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ ఆఫీస్లు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.20లక్షల వరకు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని, 50మందికిపైగా బాధితులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని రమానందన పేర్కొన్నారు.



