KU పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు అనౌన్స్

TG: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. జూలై 24న జరగాల్సిన ఫార్మ్-డి 4వ సంవత్సరం పరీక్ష జూలై 27కి, ఎంఈడి 4వ సెమిస్టర్ పరీక్ష జూలై 31కి ,జూలై 25న జరగాల్సిన ఫార్మ్-డి 3వ సంవత్సరం, బి.ఫార్మసీ 6వ సెమిస్టర్ పరీక్షలు జూలై 27న, బీటెక్ 2వ సెమిస్టర్ పరీక్ష ఆగస్టు 7కి వాయిదా పడ్డాయి. పరీక్షా కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని అధికారులు స్పష్టం చేశారు.



