పాఠశాలలో ఫుడ్ పాయిజన్

TG: రాష్ట్రంలో ఫడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరంగల్ జిల్లా మామునూరులోని జ్యోతిబాపూలే పాఠశాలలో ఉదయం టిఫిన్ తిని 18 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ వై.మనోహర్ రెడ్డి తెలిపారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



