కలెక్టర్ వినూత్న తనిఖీలతో స్కూల్స్లో మార్పు

కేరళంలోని అల్లపుజ జిల్లా కలెక్టర్ ఎస్.సుహాన్ వినూత్న కార్యక్రమంతో ప్రశంసలు అందుకుంటున్నారు. 2012 IAS బ్యాచ్కు చెందిన ఆయన, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు తరచూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నీరుకున్నమ్లోని శ్రీదేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పిల్లల మధ్య కూర్చుని భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వయనాడ్లో కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా గిరిజన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల సంఖ్య పెంచారు. కలెక్టర్ తనిఖీలతో స్కూల్స్ అన్నీ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ స్కూల్కు వచ్చి భోజనం చేస్తారోననే భయం పట్టుకుంది.



