యువ నిరసనకారులకు ఇంకా బెదిరింపులు: రాహుల్ గాంధీ
యువ నిరసనకారులతో మాట్లాడామని, వాళ్లింకా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. లోక్సభ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థపై ఫిర్యాదు చేయడం నేరం కాదని, వారు రాజ్యాంగాన్ని, భారత భవిష్యత్తును రక్షించారని అన్నారు. 15 ఏళ్ల అమ్మాయి నుంచి బలవంతంగా క్షమాపణ చెప్పించుకోవడం దారుణమన్నారు. పరీక్ష పత్రాల లీకులు ఆగాలని, విద్యా వ్యవస్థ మారాలని డిమాండ్ చేశారు.


