‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’

AP: ఎన్టీఆర్ జిల్లా పెడన మండలంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Dr.రాళ్ళపల్లి లక్ష్మణ స్వామి(చిన్నాపురం డాక్టర్) సహకారంతో పెడన బొడ్డు నాగయ్య ప్రభుత్వ కళాశాలలో ‘ఇంటికో మొక్క ప్రతి పౌరుని బాధ్యత’ కార్యక్రమం చేపట్టారు. 12000 మందికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1.6 లక్షల మొక్కలు పంచినట్టు సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ ఉస్మాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, పేరిశెట్టి నాగరవి, ఇమ్మనేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




