తెలంగాణ BJPపై రాజాసింగ్ అసంతృప్తి.. కారణం ఇదేనా?
TG: గోషామహల్ MLA రాజాసింగ్ తెలంగాణ BJPలో గ్రూపు రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ప్రకటించిన BJP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణకు చెందిన నేతలకు చోటు దక్కకపోవడంపై ఆయన రెస్పాండయ్యారు. గతంలో తెలంగాణ నేతలు జాతీయ స్థాయిలో కీలక పదవులు పొందారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని అన్నారు. నేతలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరముందని సూచించారు.



