USFI ఆధ్వర్యంలో ప్రజాభవన్ ముట్టడి

TG: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు బంద్కు పిలుపునిచ్చాయి. USFI నాయకులు హైదరాబాద్లోని ప్రజాభవనన్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను CM రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.



